టైలర్స్ డే వేడుకల్లో గూడెం మధుసూదన్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న మేరు (దర్జీ) కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తామని సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. టైలర్స్ డే పురస్కరించుకొని.. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో దర్జీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేరు కులస్తుల కోసం గతంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఇంద్రేశంలో సొంత నిధులతో 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి అందించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోను వారికి పెద్దపీట వేశారని తెలిపారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, పృథ్వీరాజ్, చంద్రశేఖర్, అంతిరెడ్డి, చంద్రకుమార్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…