రైతుల ఆర్థిక అభ్యున్నతికి కృషి

politics Telangana

_పిఎసిఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు దన్నుగా నిలవాలని ఆయన కోరారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  నియోజకవర్గంలోని రైతులు పండించిన పంటల నిలవ కోసం ఆధునిక గోదాములు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఉపేందర్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, పిఎసిఎస్ అధ్యక్షులు బిక్షపతి, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, పాలకవర్గం సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *