Districts

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి_మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ కిరణ్మయి

-మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మహిళా సంబరాలు

మనవార్తలు ,పటాన్ చెరు:

మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామచంద్రాపురం డివిజన్ కార్పొరేటర్ పుష్పనగేష్ యాదవ్ అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ 50 మంది మహిళా వైద్యులకు వారి సేవలను గుర్తించి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని రామచంద్రాపురంలోని అభినంద్ గ్రాండ్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, మెడికవర్ ఆస్పత్రి డాక్టర్ కిరణ్మయి, సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ కోర్టు అండ్ మొబైల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సృజన రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక, రాజకీయ తదితర రంగాలలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాకుండా వివక్షతకు తావులేకుండా చైతన్యవంతులై ఉండాలని చెప్పారు. మహిళల విజయానికి సంకేతంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ మహిళలకు అంకితం చేయబడిన రోజు అన్నారు. మహిళలు సమిష్టిగా ఉండి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ బ్రేక్ ది బియాస్ అనే థీమ్ తో ఈ సంవత్సరం మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. దీని ముఖ్య ఉద్దేశం పురుషులతో పాటు మహిళలు సమానమేనని తెలిపారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అన్నారు. .భవిష్యత్తులో మరిన్ని మైళ్లు రాళ్లు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళా డాక్టర్లకు అవార్డులను ప్రధానం చేశారు. అనంతరం మహిళా వైద్యులకు శాలువాతో సత్కరించి మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ చందానగర్ సెంటర్ హెడ్ శ్రీకాంత్, డాక్టర్ విశ్వేష్, మహిళా వైద్యులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

12 hours ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

12 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago