మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ మహిళా పక్షపాతి గా పేరొందారనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు మంత్రి కేటీఆర్ కు పుష్ప గుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ రావడం సంతోషకరంగా ఉందన్నారు.
మహిళా సంక్షేమంతో పాటు మహిళల భద్రతకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదింటి యువతుల వివాహం కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. లింగ వివక్ష లేని సమాజం నిర్మాణం కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని మహిళా సంఘాలకు 2021-2022 సంవత్సరానికి సంబంధించిన 42 కోట్ల 53 లక్షల రూపాయల విలువైన స్త్రీ నిధి రుణాలకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్ చేతులమీదుగా మహిళా సంఘాలకు అందజేశారు. ఈ ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల మహిళా ఉద్యోగులు, విద్యార్థినిలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…