Telangana

ఎమ్మెల్యే జిఎంఆర్ రాకతో పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది..

వ్యక్తిగత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు

పార్టీ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని పాటించాడు

ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా పటన్ చేరు అధ్యక్షుడు కోల్కురి నరసింహారెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత రాజకీయాలకు చోటు లేదని పార్టీ అధిష్టానం నిర్ణయాలకు నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని.. అధిష్టానం సమక్షంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం పై దాడులు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు పట్టణ అధ్యక్షులు, ఐ ఎన్ పి యు సి జిల్లా అధ్యక్షులు కోలుకూరి నరసింహారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పటాన్చెరులో ఆయన మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడిందని అన్నారు.

పార్టీలో చేరినప్పటి నుండి నేటి వరకు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు చిన్న ప్రతి పిలుపులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని జయప్రదం చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారి పుటీన రోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి సిఎల్పీ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారికి నివాళులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో సైతం కాంగ్రెస్ పార్టీ జిన్నారం గుమ్మడి దల నాయకులు సమాచారం అందించి వారితోనే పాల్గొన్నారని తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ పార్టీలో చేరడానికి జీర్ణించుకోకుండా అసమ్మతి రాజకీయాలు చేస్తూ కార్యకర్తలను బలి చేయడం సరికాదని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యాం రావు మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ మాజీ డైరెక్టర్ ప్రమోద్ ఆతిక్ మాజీ ఎంపీటీసీ వెoకటేష్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago