వజ్రాభరణాలు ధరించడం అంటే తనకెంతో ఇష్టం కామిక్షి భాస్కర్ల

Hyderabad Lifestyle Telangana

హైదరాబాద్

వజ్రాభరణాలు ధరించడం అంటే తనకెంతో ఇష్టమని ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2021 సాయి కామాక్షి భాస్కర్ల అన్నారు .హైదరాబాద్ తాజ్ కఈష్ణలో ఏర్పాటు చేసిన జక్ జువెలరీ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ నాలుగో తేదీ వరకు కొనసాగుతుందని జక్ ట్రేడ్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్స్ ఛైర్మన్ సయ్యద్ జకీర్ అహ్మద్ తెలిపారు.

దేశంలోని సుప్రసిద్ద అభరణాల వరక్తలు తమ సరికొత్త డిజైనరీ అభరణాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించినట్లు జక్ ట్రేడ్ ఫెయిర్ ఛైర్మన్ జకీర్ అహ్మద్ తెలిపారు. మాస్టర్ పీస్ లు , వజ్రాలు, రూబీలు, ఎమరాల్డ్స్, సఫైర్ ,ముత్యాలు ఇంకా ఇతర అరుదైన సెమీ ప్రెసియస్ స్టోన్స్ , బంగారం ,వెండి, ప్లాటినం, జడౌ అభరణాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయన్నారు.

కోవిద్ 19 భద్రతాప్రమాణాలు పాటిస్తూ ఎగ్జిబిషణ్ నునిర్వహిస్తున్నట్లు జకీర్ అహ్మద్ తెలిపారు. గతంలో నిర్వహించిన ఎక్స్ ఫో లకు హైదరాబాదీయుల నుంచి మంచి స్పందన లభించిందని… ఈ ఎడిషన్ కు మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *