కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బాపూజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలను, ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని సొంత నిధులతో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన రాజకీయ అవకాశాలు కావాలని కోరుకున్న వ్యక్తుల్లో ప్రథముడు బాపూజీ అని కొనియాడారు. తొలి దశ, మలి దశ తెలంగాణ పోరాటంలో బాపూజీ పాత్ర మరువలేనిదని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *