తెలంగాణలో కోటి వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది…

Hyderabad Telangana

 కోటి వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసుకోవడం సంతోషం…

– సీఎస్ సోమేష్ కుమార్

హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో కోటి వ్యాక్సిన డోసులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళిక బద్దంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. హై రిస్క్ గ్రూప్స్ కి వాక్సిన్ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని… దీంతో పాటు మొబైల్ వాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలు పెట్టామన్నారు .ఇప్పటికే రోజు 2లక్షలకు పైగా టీకాలు అందిస్తున్నామన్నారు. రోజుకు 7, 8లక్షల మందికి వాక్సిన్ అందించేస్థాయికి చేరుకున్నామన్నారు.

 

ఆరోగ్య శాఖ ఎంతో కష్టపడి వాక్సినేషన్ చేస్తోందని… ఆశ వర్కర్స్ నుంచి ప్రతి ఒక్కరికి సీఎస్ సోమేష్ కుమార్ ధన్యవాదాలు…వాక్సిన్ తీసుకున్న వారిలో ప్రమాద స్థాయి తక్కువగా ఉందన్నారు. టీచర్లకు కూడా ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.
30 మొబైల్ వాక్సిన్ వెహికిల్స్ లో వాక్సినేషన్ కి సిద్ధంగా ఉన్నాయన్నారు . 18సంవత్సరాలు పైబడిన వారికి కూడా టీకా అందజేస్తున్నామన్నారు . వచ్చే నెలలో 2nd డోస్ వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు . ప్రజలందరూ తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవడం ద్వారా , వాక్సిన్ వేసుకోవడం ద్వారా కరోనా బారినుండి తప్పించుకోవచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *