శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శారదా విద్యానికేతన్ లో బుధవారం రోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సరస్వతి పూజ, హోమం, సామూహిక అక్షరాబ్యాసం నిర్వహించి నూతన అడ్మిషన్స్ తీసుకున్న విద్యార్థులకు వైట్ యూనిఫామ్, స్లెట్స్ అశ్రీత అందజేశారు. వసంత పంచమి వేడుక విశిష్టత గురించి ప్రన్సిపాల్ నీరజ వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.