చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం..
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వడ్డే ఓబన్న సేవలు గొప్పవని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ నీలం మధు క్యాంపు కార్యాలయంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య మిత్రుడిగా ముఖ్య అనుచరుడిగా, సేనాధిపతిగా చిన్న, సన్నకారు రైతులను వేధిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం పై తిరుగుబావుట ఎగురవేసిన మహనీయుడు వడ్డే ఓబన్న అన్నారు.నేటి తరం ఆ మహానియుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు,ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు మంజలి దస్తగిరి,అశోక్, కుప్పస్వామి,అభిరామ్, భీమయ్య, హనుమత్, మహేష్, ప్రవీణ్, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
