వడ్డే ఓబన్న పోరాటం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్ 

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వడ్డే ఓబన్న సేవలు మరువలేనివని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.వడ్డే ఓబన్న 217 వ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలోని నీలం మధు తన కార్యాలయంలో వడ్డేఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య మిత్రుడిగా ముఖ్య అనుచరుడిగా, సేనాధిపతిగా చిన్న, సన్నకారు రైతులను వేధిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం పై తిరుగుబావుట ఎగురవేసిన మహనీయుడు వడ్డే ఓబన్న అన్నారు.నేటి తరం ఆ మహానియుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వలేపు వెంకటేశ్, మంజలి శ్రీనివాస్, ఈశ్వర్,రాజు,నగేష్, రాము రాయుడు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *