పటాన్ చెరులోఘనంగా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Districts politics Telangana

_దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్రం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు:

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేడు దేశానికి దిక్సూచిగా రూపుదిద్దారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఉద్యమ పార్టీ యే రాష్ట్ర ఆవిర్భావ అధికార పార్టీ గా ఎన్నిక కావడం టిఆర్ఎస్ పట్ల ప్రజలకు ఉన్న అభిమానాన్ని చాటి చెప్పిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలోకి తీసుకెల్లిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఒకవైపు ప్రభుత్వంతో పాటు మరోవైపు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ప్లీనరీకి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, పటాన్చెరు ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, దశరథ రెడ్డి, విజయ్ కుమార్, బసవేశ్వర్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *