మనవార్తలు , శేరిలింగంపల్లి :
తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత, విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 88 వ జయంతి సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఎం.ఐ జి కాలనీ లోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి,ఉపాధ్యక్షులు కొల్లోజు కృష్ణ చారి, కోశాధికారి ర్యాలమడుగు వడ్ల శంకరాచారి, ఇతర కార్యవర్గ సభ్యులు రాణోజు మధుపంతులు,పాతూరి వడ్ల రాము చారి,వడ్ల రాజేందర్ చారి, మరియు ఇతర సంఘం సభ్యులు శ్రీశైలం చారి, పరమేశ్వర్ చారి చంద్రశేఖర్ చారి, శివ చారి ,ప్రశాంత్ చారి, సాయి కుమార్ చారి, రవి చారి, శ్రీనివాస్ చారి, రామ రాజు చారి సదానందం చారి ,తారా సింగ్, శివ శంకర చారి తదితరులు పాల్గొన్నారు.