కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

ముత్తంగి డివిజన్ పరిధిలోని న్యూ టౌన్, డి ఎన్ కాలనీలలో పర్యటన

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

ఇటీవల జిహెచ్ఎంసిలో విలీనమైన ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ముత్తంగి డివిజన్ పరిధిలోని డిఎన్ కాలనీ, న్యూటౌన్ కాలనీలలో ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రధానంగా కాలనీలు ఏర్పడినప్పుడు నిర్మించిన సిసి రోడ్లు, అంతర్గత మురికినీటి కాలువలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని.. వెంటనే వాటిని ఆధునికరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా సీసీ రోడ్లు, యుజిడిల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని  వెంటనే నిధులు మంజూరు చేస్తామని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల జిహెచ్ఎంసిలో విలీనమైన ముత్తంగి పరిధిలోని ప్రతి కాలనీలో నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఈఈ సురేష్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు సిల్వెరి శ్రీనివాస్, శ్రీనివాస్ గుప్తా, కుమార్ గౌడ్, మేరాజ్ ఖాన్, కిట్టు, సందీప్, రామకృష్ణ, అబేద్, యాదగిరి, బాబుల్ రెడ్డి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *