నేడు పటాన్చెరులో అయ్యప్ప స్వామి మహా పడిపూజ

politics Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో సోమవారం అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పడిపూజ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు తెలిపారు. ప్రముఖ గాయకుడు విజయ్ ఏసుదాసు బృందం చే భజన గీతాలాపన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అయ్యప్ప స్వాములు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *