పనుల్లోనాణ్యత లేదు కౌన్సెలర్ చంద్రయ్య

Districts politics Telangana

మనవార్తలు ,జిన్నారం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ గాంధీ నగర్ కాలనీలో పరిధిలోని 1వ వార్డ్ కన్సిలర్ చంద్రయ్య ఆదివారం కాలనీలో పర్యటించి జరుగుతున్నా పలు అభివృధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమీషనర్ రాజేందర్ కుమార్, ఎఈ కిష్టయ్య పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి అండదండలతో కాంట్రాక్టర్ పనిలో నాణ్యత పాటించటం లేదు అని డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకుండా సిమెంట్, ఇసుకకి బదులుగా పూర్తి గా క్వాలిటీ లేని డస్ట్ వాడుతున్నారని. అందువల్ల కట్టే సమయంలోనే బూడిది లా రాలి పోతుందని అన్నారు. ఈ విషయం పై అధికారులను 17 లక్షల రూపాయల మున్సిపల్ నిధులు కేటాయించిన ఎందుకు పనిలో నాణ్యత ఉండటం లేదని నిలదీయగా పనులు జరుగుతున్నాయి కదా వాటికోసం మీకు ఎందుకు అని కౌన్సిలర్ అయ్యిన నాకు నిర్లక్ష్యంగా బడులిస్తునారు అని మండిపడ్డారు.వెంటనే ఈ పనులను మున్సిపల్ అధికారులు పరిశీలించి పనుల్లో నాణ్యత తీసుకునేటట్లు చూడాలని  లేదంటే పనులను అడ్డుకుంటాం అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *