శేరిలింగంపల్లి :
పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, యువతకు, మహిళలకు పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ అన్నారు. తనను మర్యాద పూర్వకంగా కలిసిన బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు, చందా నగర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి లు కలిసి ఆమే సలహాలు తీసుకున్నారు. కొద్ది తేడాతో ఓడినా భవిష్యత్తులో దానిని పునాదిగా చేసుకొని ఇంకా జనాల్లో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పనితనాన్ని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఆమెను కలిసిన వారిలో సింధూ రెడ్డితో పాటు బిజెపి నేత కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి కూడా ఉన్నారు.