ఇద్దరూ మృతికి కారణమైన లారీ డ్రైవర్ రిమాండ్…

Crime

ఇద్దరూ మృతికి కారణమైన లారీ డ్రైవర్ రిమాండ్…

పటాన్ చెరు:

ఇద్దరు మృతికి కారణమైన లారీ డ్రైవర్ ను రిమాండ్ కు తరలించిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి….

హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన నర్సింలు(34), విజయ్(23) ఇద్దరు వారు పనిచేసే సంస్థ పనిపై సంగారెడ్డి వెళ్లి తిరిగి కొండాపూర్ వస్తుండగా పటాన్చెరు మండల పరిధిలోని లక్దారం గేటు సమీపంలో గుర్తుతెలియని లారీ బుధవారం రాత్రి ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు. దర్యాప్తులో భాగంగా గుర్తుతెలియని లారీ కోసం గాలించారు. ఈ క్రమంలో లారీ ముత్తంగి ఓవర్ పై నుండి శంషాబాద్ వైపు వెళ్తూ శంషాబాద్ రీలింగ్ ఢీకొట్టింది. దీంతో శంషాబాద్ పోలీసులు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ మహదేవ్ అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించి ఉన్నాడు. దీంతో సమాచారం తెలుసుకున్న పటాన్చెరువు పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్ తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *