36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన..
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని సర్వ మతాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడ మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని చారిత్రక గుమ్మటాల పరిరక్షణ కోసం 36 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పురాతన దేవాలయాలు, మసీదుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సొంత నిధులతో రెండు వందలకు పైగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మించడంతోపాటు ప్రతి ఒక్కరిలో పరమతసహనాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ . ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నర్రా బిక్షపతి, పృథ్వి రాజ్, లియాకత్ అలీ, బాబా సెట్, అజ్మత్, వాజీద్ అలీ, హమీద్, ఆషమ్, ఇర్షాద్, ఇమ్రాన్, మొయిన్, చందు, శ్రీ రాములు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
