ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు అభినందనీయం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

సామాజిక సేవలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని లయన్స్ క్లబ్ లో ఎమ్మెన్నార్ హాస్పిటల్ వైద్యులచే ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధ వహించడంతోపాటు, దురాలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ జైపాల్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, శీనయ్య, పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *