Hyderabad

హుజురాబాద్ లో కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది….

హుజురాబాద్ లో కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది….

– ఈటల రాజేందర్

హైదరాబాద్:

హుజురాబాద్లో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుందని… ఇది కురుక్షేత్రయుద్ధం గా అభివర్ణించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ .
20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని..
అధికారంలో ఉన్న నాడు,లేని నాడు ఎప్పుడైనా నాకు ఉన్నంతలో పని చేసి ప్రజల మెప్పు పొందాని ఈటల అన్నారు.నియోజకవర్గ ప్రజలు
బిడ్డ మా ఇళ్లలో భర్తలు చనిపోయిన వాళ్ల పెన్షన్ లు పెండింగ్ లో ఉన్నాయని..పెళ్ళిళ్ళు జరిగి రెండు సంవత్సరాలు గడిచినా కళ్యాణ లక్ష్మీ పథకం కింద చెక్కులు రావడం లేదంటున్నారు.
కొత్త పెన్షన్ లు ,రేషన్ కార్డ్ లు వెంటనే ఇప్పియ్యలని ముఖ్య మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు.

తాను గాలికి గెలువ లేదని…ప్రజలు నన్ను నమ్మి వోట్ వేస్తే గెలిచానని చెప్పుకొచ్చారు. ఎం.పి.ఎన్నికల్లో 50 వేల పై చిలుకు మెజారిటీ నన్ను చూసి ఇచ్చారని గుర్తు చేశారు.తాను
ఏనాడు వేరే పార్టీ పెడుత అని చెప్పలేదని…మీరే నన్ను బహిష్కరించారని చెప్పారు.మీరు తోడుకున్న బొందలో మీ ప్రభుత్వమే పడ్తుందని ఈటల అన్నారు.ఈటెల గెలుపు అంటే ఆత్మ గౌరవం గెలుపన్నారు.

నా లాంటి వాడు మాట్లాడితే నే మీకు తెలుస్తుంది.ధాన్యం ప్రభుత్వం కొంటుంది అని చెప్పిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు.కొంత మంది చెంచా గాలతో నా మీద కరపత్రాలు కొట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

2018 ఎన్నికల్లో నా ప్రత్యర్థి కి డబ్బులు ఇచ్చి నన్ను ఓడ గొట్టే ప్రయత్నం చేశారని..అన్ని బరించానని….అది నా సహనం తప్ప భయం కాదన్నారు. నా నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని తెలిపారు.

ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం జరుగ బోతుందని
..ధర్మానికి అధర్మానికి జరుగబోయే యుద్ధం అని ఈటల అన్నారు.ఈ యుద్ధం లో విజయం హుజూరాబాద్ ప్రజలదన్నారు.

ప్రజాస్వామికంగా గెలిచే ప్రయత్నం చెయ్యండి దొంగ దారిన గెలిచే ప్రయత్నం చేస్తే మా ప్రజలు ఊరుకోరన్నారు.

Venu

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

2 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

2 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

2 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

2 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

2 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago