కుటుంబాన్ని ఆదుకున్న ఏ కే ఫౌండేషన్
హైదరాబాద్:
కరోనా వైరస్ సోకి మృతి చెందిన ఓ పేషెంట్ కుటుంబాన్ని ఏ కే ఫౌండేషన్ ఆదుకుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ కి చెందిన అక్రమ్ పది రోజుల క్రితం కరోనా వ్యాధి బారిన పడి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ ఖదీర్ వారి కుటుంబానికి వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు . ఏ కే ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని… పేద ముస్లీం కుటుంబానికి ఆదుకునేందుకు తమ వంతుసాయం చేసినట్లు అబ్దుల్ ఖదీర్ తెలిపారు .
