కార్మికుల సంక్షేమమే సిఐటియు లక్ష్యం

politics Telangana

_అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ లో సి ఐ టి యూ ను గెలిపించాలీ

_సిఐటియూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

కార్మికుల సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడే సిఐటియుని జరగబోయే కార్మిక సంఘం ఎన్నికల్లో సిఐటియుని గెలిపించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ లో వచ్చేనెల 3 న జరిగే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను పురస్కరించుకొని శనివారం పరిశ్రమ ముందు జరిగిన గేట్ మీటింగ్ లో మల్లేశం మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి,హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం సిఐటియూ సంఘం అని అన్నారు.రాష్ట్రంలో, జిల్లాలో అనేక పరిశ్రమల్లో కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాలు,ఉద్యోగ భద్రత,సంక్షేమం కోసం పని చేస్తున్న సంఘం సిఐటియూ అని ఆయన అన్నారు.కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వంతో,యాజమాన్యాల తో పోరాడి కార్మికుల కు కార్మిక కుటుంబాలకు కాపాడుకునేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్మికులు ఇతరుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని వచ్చేనెల 3న జరిగే ఎన్నికల్లో చుక్క గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సిఐటియుని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాండురంగారెడ్డి,నర్సింహ్మ రెడ్డి,రాజు, శ్రీనివాస్,రామకృష్ణ, సత్యనారాయణ వివిధ పరిశ్రమల నాయకులు,కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *