ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తెరాస శ్రేణుల నిరసన

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్చెరు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా బుధవారం నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసిన బిజెపి నేడు తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ అవహేళనగా మాట్లాడడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయితే, ప్రధాని స్థాయి వ్యక్తులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో బీజేపీని తరిమికొట్టే రోజులు రాబోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్ ,సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *