Hyderabad

తెలంగాణ ముదిరాజ్ యువజనసమాఖ్య ఆధ్వర్యంలోముదిరాజ్ ల ఆత్మగౌరవ పాదయాత్ర – రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు , శేరిలింగంపల్లి :

తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో త్వరలోనే ముదిరాజ్ ల ఆత్మ గౌరవ పాద యాత్ర ను చేపట్టనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ముదిరాజ్ లు అణచివేతకు గురి అవుతున్నారని.ముదిరాజ్ ల మనోభావాలను దెబ్బ తీసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో , తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముదిరాజ్ లను బీసీ డీ నుండి బీసీ ఏ కి మార్చాలని ,బీసీ కమిషన్ వేసి ముదిరాజ్ ల యొక్క సమగ్ర నివేదికను బీసీ కమిషన్ ద్వారా సుప్రీం కోర్టుకు పంపించాలని ఎన్నో సార్లు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.

అయిన ఈ ప్రభుత్వం ముదిరాజ్ ల సమస్య ను పట్టించుకోకుండా బీసీ కమిషన్ ద్వారా ముదిరాజ్ ల రిపోర్ట్ ను సుప్రీం కోర్టు కు పంపించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ లకు జనాభా ధమాశ ప్రకారం చట్టసభల్లో ముదిరాజ్ లకు కేటాయించాల్సిన సీట్లు కేటాయించకుండా పార్టీ లు అన్యాయం చేస్తున్నాయని అన్నారు.

ముదిరాజ్ ల హక్కుల సాధన కోసం, ముదిరాజ్ ల ఆత్మ గౌరవ పాద యాత్ర ను ముదిరాజ్ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో త్వరలోనే చేపట్ట బోతున్నమని. కరోనా ,ఒమిక్రాన్ ప్రభావం తగ్గగానే మా పాదయాత్ర ను ప్రారంభిస్తామని ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ తెలియజేశారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago