పటాన్చెరులో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం

Hyderabad politics Telangana

జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

పటాన్చెరు పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని అన్నారు.

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, వెంకటేశ్, నాయకులు,.కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *