politics

పదోతరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థుల ప్రతిభ

మనవార్తలు, శేరిలింగంపల్లి :

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజు విడుదలైన ఎస్‌ఎస్‌సి ఫలితాలలో ఎప్పటిలాగే మియాపూర్‌ బ్రాంచ్‌ త్రివేణి విద్యార్థులు తమ సత్తా చూపారు. టాప్‌ గ్రేడులను సాధించి తమ ప్రతిభను చాటారు. తెలంగాణలో టెన్త్ ఫలితాల్లో త్రివేణి పాఠశాల సంచలన రికార్డును సాధించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదవతరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థులు విజయదుందిభి మ్రోగించారు. ఈ సందర్భంగా త్రివేణి విద్యాసంస్థల డైరక్టర్‌ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి పత్రికలకు ఓ ప్రకటనను విడుదల చేశారు. మియాపూర్‌ బ్రాంచీలో గల తమ విద్యార్థులు ఎస్‌ఎస్‌సి గ్రేడుల్లో 13 మంది జిపిఏ 10/10కి పాయింట్లు సాధించారని తెలిపారు. ఇది గతం కంటే ఘనంగా సాధించామని అన్నారు.

అలాగే 27 మంది 9.7కి పైగా పాయింట్లను, 9.0కి పైగా పాయింట్లు 60 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. ఇక మొత్తం ఏ గ్రేడులను 60 మంది విద్యార్థులు సాధించారని, అలాగే మ్యాథ్స్‌లో ఏ గ్రేడులను 67 మంది విద్యార్థులు, సైన్స్‌లో ఏ గ్రేడులను 41 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఇన్ని విజయాలకు కారణం మారే తరానికి, మారే విద్యావిధానాలకు అనుగుణంగానూ, నేటి పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యాప్రణాళికలను రూపొందించి తదనుగుణంగా విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు.అలాగే తమ విద్యాసంస్థలో అనుభవం, అంకితభావం గల బోధనా సిబ్బంది ఉండటం వలన ఈ సంచలన విజయాలు సాధించడం సాధ్యమైందని పేర్కొన్నారు. టాప్‌గ్రేడ్‌ల సాధనకే పరిమితంకాక, జాతీయస్థాయి పోటీ పరీక్షలైన ఐఐటి, నీట్, జె ఎస్ ఓ, ఎన్ టి ఎస్ ఈ, ఒలంపియాడ్ వంటి రేపటి పోటీపరీక్షల్లో కూడా విజయం సాధించేలా పటిష్టమైన పునాదిని ఏర్పరుస్తుందని, వారి ఉజ్వల భవితకు నిరంతరం కృషిచేస్తుందిని తెలిపారు.

ఈ విజయాలే నిదర్శనమని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలలో 24 స్టేట్‌ ర్యాంకులను సాధించిన ఘనత తమకే సొంతమని, అలాగే సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌, జిల్లాస్థాయి సైన్స్‌ ఫెయిర్‌లలో వరుసగా మూడు సార్లు బెస్ట్‌ స్కూల్‌ అవార్డును, రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలలో ఆరుసార్లు ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచినట్లు తెలిపారు. ఈ విజయాలు హైదరాబాద్‌, ఖమ్మం మరియు కొత్తగూడెంలలో గల తమ బ్రాంచీలనుండి సాధించామని ఈ సందర్భంగా టెన్త్‌లో విజయం సాధించిన విద్యార్థులకు, ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, బోధన, బోధనేతర సిబ్బందికి తమ శుభాభినందనలను తెలిపారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago