మనవార్తలు, శేరిలింగంపల్లి :
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజు విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఎప్పటిలాగే మియాపూర్ బ్రాంచ్ త్రివేణి విద్యార్థులు తమ సత్తా చూపారు. టాప్ గ్రేడులను సాధించి తమ ప్రతిభను చాటారు. తెలంగాణలో టెన్త్ ఫలితాల్లో త్రివేణి పాఠశాల సంచలన రికార్డును సాధించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదవతరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థులు విజయదుందిభి మ్రోగించారు. ఈ సందర్భంగా త్రివేణి విద్యాసంస్థల డైరక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి పత్రికలకు ఓ ప్రకటనను విడుదల చేశారు. మియాపూర్ బ్రాంచీలో గల తమ విద్యార్థులు ఎస్ఎస్సి గ్రేడుల్లో 13 మంది జిపిఏ 10/10కి పాయింట్లు సాధించారని తెలిపారు. ఇది గతం కంటే ఘనంగా సాధించామని అన్నారు.
అలాగే 27 మంది 9.7కి పైగా పాయింట్లను, 9.0కి పైగా పాయింట్లు 60 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. ఇక మొత్తం ఏ గ్రేడులను 60 మంది విద్యార్థులు సాధించారని, అలాగే మ్యాథ్స్లో ఏ గ్రేడులను 67 మంది విద్యార్థులు, సైన్స్లో ఏ గ్రేడులను 41 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఇన్ని విజయాలకు కారణం మారే తరానికి, మారే విద్యావిధానాలకు అనుగుణంగానూ, నేటి పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యాప్రణాళికలను రూపొందించి తదనుగుణంగా విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు.అలాగే తమ విద్యాసంస్థలో అనుభవం, అంకితభావం గల బోధనా సిబ్బంది ఉండటం వలన ఈ సంచలన విజయాలు సాధించడం సాధ్యమైందని పేర్కొన్నారు. టాప్గ్రేడ్ల సాధనకే పరిమితంకాక, జాతీయస్థాయి పోటీ పరీక్షలైన ఐఐటి, నీట్, జె ఎస్ ఓ, ఎన్ టి ఎస్ ఈ, ఒలంపియాడ్ వంటి రేపటి పోటీపరీక్షల్లో కూడా విజయం సాధించేలా పటిష్టమైన పునాదిని ఏర్పరుస్తుందని, వారి ఉజ్వల భవితకు నిరంతరం కృషిచేస్తుందిని తెలిపారు.
ఈ విజయాలే నిదర్శనమని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలలో 24 స్టేట్ ర్యాంకులను సాధించిన ఘనత తమకే సొంతమని, అలాగే సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్, జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్లలో వరుసగా మూడు సార్లు బెస్ట్ స్కూల్ అవార్డును, రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలలో ఆరుసార్లు ఓవరాల్ ఛాంపియన్గా నిలిచినట్లు తెలిపారు. ఈ విజయాలు హైదరాబాద్, ఖమ్మం మరియు కొత్తగూడెంలలో గల తమ బ్రాంచీలనుండి సాధించామని ఈ సందర్భంగా టెన్త్లో విజయం సాధించిన విద్యార్థులకు, ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, బోధన, బోధనేతర సిబ్బందికి తమ శుభాభినందనలను తెలిపారు.