సొంత నిధులతో 49 మంది ఆటో డ్రైవర్లకు లైసెన్సులు_ గూడెం మధుసూదన్ రెడ్డి

పటాన్చెరు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆటోవాలాలకు అండగా నిలిచారు. పటాన్చెరు పట్టణానికి చెందిన 49 మంది ఆటోడ్రైవర్లకు లక్షా 75 వేల రూపాయలు సొంత ఖర్చుతో డ్రైవింగ్ లైసెన్స్ లు అందజేశారు. ఈ సందర్భంగా గూడెం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ఆటోలు నడిపి ప్రయాణికుల మనసును గెలుచుకోవాలని అన్నారు. ఆటోలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ,వాహనాలు నడిపేటప్పుడు […]

Continue Reading

లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు సమాజసేవలో లయన్స్ క్లబ్ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో లయన్స్ క్లబ్ పటాన్చెరు శాఖ ఆధ్వర్యంలో అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు గ్రహీత లయన్ బాబురావు పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు మాజీ జెడ్పిటిసి జైపాల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]

Continue Reading

పాశమైలారం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో గురువారం సాయంత్రం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ మోటే కృష్ణ ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. పోతురాజుల నృత్య విన్యాసాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.    

Continue Reading

ప్రజలకు జవాబుదారీగా పని చేయాలి అమీన్పూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. గురువారం అమీన్పూర్ ఎంపీపీ దేవానందం అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం దరిచేరకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత అధికారులకు, ప్రజాప్రతినిధుల పైన ఉందన్నారు. అనవసర వివాదాల అంశాల్లో తలదూర్చకూడదని సూచించారు. రాష్ట్రంలో అతి చిన్న మండలంగా […]

Continue Reading

పటాన్చెరులో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రణాళికాబద్ధంగా సమస్యల పరిష్కారం

పటాన్చెరు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి పట్టణంలోని గోకుల్ నగర్, సరాయి, రాఘవేంద్ర కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం విషయంలో ప్రజలు బల్దియా సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. రక్షిత మంచినీరును వృధా చేయకూడదని కోరారు, తడి చెత్తను […]

Continue Reading

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ లో నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో అమీన్పూర్ మున్సిపాలిటీ, అమీన్పూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు అయిన నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ […]

Continue Reading

ఎన్ సి సి క్యాంపుకు ఎంపిక ఆయిన ఆర్నాల్డ్ పాఠశాల విద్యార్థులు

రామచంద్రాపురం రామచంద్రాపురం అశోక్ నగర్ లోని సేంట్ ఆర్నాల్డ్ పాఠశాలలో ఎన్ సిసి క్యాంపు 33(టి)బిఎన్ బ్యాచ్.సంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ద్వారా 25 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. పాఠశాల ఎన్ సిసి శిక్షనోపాధ్యాయులు శామ్యూల్ ఆల్ఫ్రెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్ లోసుబేధార్ జివి శేఖర్ మరియు హావిల్దార్ రంజిత్ సింగ్ లు పాల్గొని ఎంపిక చేయడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ జియో ప్రాస్టిన్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు ఎన్ సిసి క్యాంపుకు ఎంపిక కావడం […]

Continue Reading

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మిస్సైల్ మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి   ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పటాన్చెరు పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో గల అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలు స్మరించుకున్నారు. నిరుపేద కుటుంబం నుండి ప్రారంభమైన అబ్దుల్ కలాం ప్రస్థానం తన మేధాశక్తితో ప్రపంచ స్థాయిలో దేశాన్ని గర్వపడే స్థాయికి తీసుకుని వెళ్లారని […]

Continue Reading

త్వరలో బండ్లగూడ వరద నీటి మళ్ళింపు కాలువ పనులు ప్రారంభం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు దశాబ్దాలుగా వర్షాకాలంలో వరద నీటితో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న బండ్లగూడ వాసులకు త్వరలో ఊరట లభించనుంది. జాతీయ రహదారి నుండి బండ్లగూడ పరిధిలోని మార్క్స్ నగర్ మీదుగా దోషం చెరువు వరకు వరద నీటి మళ్ళింపు కాలువ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, జిహెచ్ఎంసి, టి ఎస్ ఐ ఐ సి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అభివృధి శూన్యం…

పటాన్‌చెరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అభివృధి శూన్యమని, కేసీఆర్‌ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర ప్రచార కమిటి అధ్యక్షులు కొత్త బస్వరాజ్ పాటిల్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు అసంతృప్తికి గురవుతున్నారని తెలిపారు. అంతే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చకపోగా, రోజు రోజుకు కొత్త […]

Continue Reading