రైతుల‌ కోసం త్రివేణి విద్యార్థుల విరాళo సేకరణ గవర్నర్ తమిళ సైకి aఅందజేసిన సంస్థ అధినేత . వీరేంద్ర చౌదరి…

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతుల సహాయార్థం ప్రధాన మంత్రి సహాయ నిధికి త్రివేణి ఎడ్యుకేషనల్ విద్యార్థులు‌ జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షా నూట‌ పదహారు రూపాయల విరాళాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కి అందజేశారు. త్రివేణి డైరెక్టర్ డా వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా భారతదేశ 5వ ప్రధానమంత్రి, భారతదేశపు రైతుల విజేతగా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ […]

Continue Reading

పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించండి : గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్చెరు తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డిజిల్ పై వ్యాట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రుద్రారంలో ఎడ్ల బండిపై తిరుగుతూ నిరసన ప్రదర్శించిన పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్భంగా గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పెట్రోలో, డీజిల్‌పై విధించిన 35.2 శాతం వ్యాట్ ను తగ్గించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ కరోనా మహమ్మారి కారణంగా […]

Continue Reading

ఢిల్లీ రాజకీయాలు పక్కనపెట్టి ముందు ధాన్యం కొనండి

ప్రభుత్వం తీరుపై షాద్ నగర్ బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం మనవార్తలు ,షాద్ నగర్ షాద్ నగర్ మార్కెట్ యార్డును పరిశీలించిన బీజేపీ బృందంవర్షా కాలం పంట వచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనే దిక్కులేకుండా పోయిందని, ధాన్యం కొనమంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నారని ముందు టిఆర్ఎస్ రాజకీయాలు పక్కనపెట్టి ముందు రైతుల నుంచి ధాన్యం కొనాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి […]

Continue Reading

ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడుతాం జిల్లా పదాధికారుల సమావేశంలో సామ రంగారెడ్డి

మనవార్తలు, శేరిలింగంపల్లి : ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేయకుండా ఏవిందంగా మోసం చేస్తుందో ప్రజల్లో ఎండగడుతామని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. మంగళవారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియపూర్ ఆర్.బి.ఆర్ కాంప్లెక్స్ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతణ నిర్వహించిన జిల్లా ఓబీసీ మోర్చా పూర్తి స్థాయి పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్యాథి గా ఆయన హాజరై మాట్లాడుతూ రాష్ట్రoలో టీఆరెస్ ప్రభుత్వం ఓబీసీలను కేవలం ఓటు […]

Continue Reading

రాష్ట్రం లో రైతులకు రక్షణ లేదు:రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు , రామచంద్రపురం: సోమవారం నల్గొండ జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి కాన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు రామచంద్రపురం పట్టణం లో బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతు ఈ దాడులు పూర్తిగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల పరామర్శకు వెళ్లిన బండి […]

Continue Reading

రెండు కోట్ల రూపాయలతో తిమ్మక్క చెరువు సుందరీకరణ పనులు

వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన మనవార్తలు ,పటాన్చెరు పటాన్చెరు పట్టణ పరిధిలోని తిమ్మక్క చెరువును రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 40 లక్షల రూపాయలతో తిమ్మక్క చెరువు చుట్టూ నిర్మించనున్న వాకింగ్ ట్రాక్ పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్ లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Continue Reading

టిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు మండల కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రతిపక్షాలవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు సమగ్ర వివరాలతో ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టండి మనవార్తలు,పటాన్చెరు గ్రామ స్థాయి నుండి ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టతకు పని చేస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభ అంశాలపై శనివారం పాటి గ్రామ చౌరస్తాలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. […]

Continue Reading

షీ టీమ్ లు దేశానికే ఆదర్శం – గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా

పటాన్‌చెరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఏర్పాటు చేసిన షీ టీమ్ లు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయని ఐపీఎస్ అధికారిణి, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా అన్నారు. గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గీతం విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె పాల్గొన్నారు. ఎన్డీటీవీ పూర్వ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ – గీతం వ్యూహాత్మక కార్యక్రమాలు విస్తరణ డెరైక్టర్ నిధి సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె […]

Continue Reading

వైకుంఠధామం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న ట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రామేశ్వరంబండలో వైకుంఠధామం నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ ధరణి అంతి రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు . నియోజవర్గంలో ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు పూర్తయినట్లు […]

Continue Reading

బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఏవో కు వినతి పత్రం అందజెత

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రoలో వెనుక బడిన బీసీ కులాలందరికి బీసీ బంధు ప్రకటించి, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ స్వర్ణలత కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు భేరీ రామచందర్ […]

Continue Reading