Telangana

విజయవంతంగా ముగిసిన అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులో ఏప్రిల్ 3-4 తేదీలలో పర్యావరణ హిత కృత్రిమ మేధస్సు, పరిశ్రమలలో వినియోగం (గ్రీన్ ఏఐ-2025) పేరిట నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు ఏఐ రంగంలో జ్జాన మార్పిడి, ఆవిష్కరణ, సహకారం కోసం ఒక వేదికగా తోడ్పడింది. ఈ సదస్సు ఏఐ జనరేటెడ్ మోడల్స్, ఆటోమేటెడ్ లెటర్ జనరేషన్, ఇండస్ట్రియల్ అప్లికేషన్లపై దృష్టి సారించే ముందస్తు కార్యశాలలతో ప్రారంభమైనట్టు సదస్సు నిర్వహకురాలు డాక్టర్ నందిత భంజ చౌధురి వెల్లడించారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, వెరిజోన్ డేటా సర్వీసెస్ తో సహా ప్రముఖ సంస్థల నుంచి అనేక మంది ప్రముఖ వక్తలు ఆరోగ్య సంరక్షణ, గేమింగ్, ఆర్కిటెక్చరల్ డిజైన్, అంతకు మించి ఏఐ-ఆధారిత ఆవిష్కరణపై సదస్యులకు లోతైన అవగాహన కల్పించినట్టు ఆమె తెలిపారు. గత రెండు రోజులుగా ఈ సదస్సులో పాల్గొన్నవారు అంతర్దృష్టి చర్చలతో పాటు తమ ఆలోచనలను ఇతరులతో పంచుకున్నట్టు చెప్పారు. మేధోపరమైన చర్చ, మార్గదర్శక పురోగతుల కేంద్రంగా ఈ సదస్సు నిరూపితమైందన్నారు. ఏఐ, దాని వినియోగిస్తున్న నిపుణులు కొంతమందిని ఒకచోట చేర్చినట్టు తెలిపారు. వారందరికీ హృదయ పూర్వక కృతజ్జతలను డాక్టర్ నందిత తెలియజేశారు. చివరగా, ఈ సదస్సులో స్వయంగా పత్ర సమర్పణ చేసిన వారికి ప్రశంసా పత్రాలను సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) విభాగాధిపతి ప్రొఫెసర్ శిరీష, సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా ప్రదానం చేశారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago