మనవార్తలు ,పటాన్ చెరు:
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని చైతన్య స్కూల్ సీబీఎస్ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై, మాట్లాడుతూ చైతన్య స్కూల్ క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు. చైతన్య స్కూల్లో చదివిన విద్యార్థులు ఉన్నతమైన స్ధానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ చదువుకోవాలని, దానితో విద్యనభ్యసించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పి.పి రాథోడ్, చైతన్య స్కూల్ కరస్పాండెంట్ నర్సింహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…