Hyderabad

స్వీయ క్రమశిక్షణ విజయానికి సోపానం – ప్రేరణోపన్యాసంలో ఎన్ సీసీ క్యాడెట్లకు గీతం ప్రోవీసీ ఉద్బోధ

పటాన్‌చెరు:

స్వీయ క్రమశిక్షణ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి, స్వీయ నియంత్రణకు, ప్రతికూల పరిస్థితులలో కూడా సంయమనంతో వ్యవహరించడానికి ఉపకరిస్తుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ఉద్బోధించారు. గీతం ఈ నెల 6 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహిస్తున్న పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం (సీఏటీసీ -1) లో పాల్గొంటున్న ఎన్ సీసీ క్యాడెట్లను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రేరణోపన్యాసం చేశారు.

ఎన్ఎసీసీ నినాదమైన ఐక్యత, క్రమశిక్షణ గురించి వివరిస్తూ ఇవి జీవితంలో ఒక వ్యక్తి రాణించడానికి, వచ్చిన అవకాశాలను ఓ బృందంగా సద్వినియోగం చేసుకోవడానికి దోహదపడతాయన్నారు. సమష్టిగా ఉంటే సులువుగా లక్ష్యాలను సాధించవచ్చని ఆయన ఉద్బోధించారు. యువతలో ధైర్యం, సహృదయత, క్రమశిక్షణ, నాయకత్వం, లౌకిక దృక్పథం, సాహస స్ఫూర్తి, క్రీడా నెపుణ్యం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలను వృద్ధి చేయడానికి ఇటువంటి వార్షిక శిక్షణా శిబిరాలు ఉపకరిస్తాయని చెప్పారు.

 

సాయుధ దళాలతో సహా అన్ని రంగాలలో నాయకత్వం అందించడానికి, దేశ సేవ కోసం సదా సిద్ధంగా ఉండడానికి వ్యవస్థీకృత శిక్షణ, ప్రేరేపిత యువతగా మానవ వనరుల సృష్టికి ఎన్ సీసీ తోడ్పడుతుందన్నారు. ఐఐటీ మద్రాసులో పనిచేసేటప్పుడు భారత రక్షణ దళాలకు తాను అందించిన పలు సేవలను ఈ సందర్భంగా ఆయన జ్ఞప్తికి తెచ్చుకున్నారు. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, మదర్ థెరిస్సాలను ఉటంకిస్తూ పలు సందేశాలు, త్యాగ నిరతితో సహా సేవా దృక్పథం ఆవశ్యకతను ప్రొఫెసర్ శివప్రసాద్ వివరించారు.

సంగారెడ్డిలోని 33 వ తెలంగాణ ఎన్ సీసీ బెటాలియన్ పాలనాధికారి కర్నల్ ఎస్.కె.సింగ్ అతిథిని సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ మేజర్ కేసర్ రాణా, పలువురు శిక్షకులు, ఎన్ సీసీ అనుబంధ అధికారులు, క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంపులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కవాతు శిక్షణ ఆకట్టుకున్నాయి.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago