_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన న్యాయవాదులు
మనవార్తలు ,పటాన్ చెరు;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పటాన్చెరుకు మంజూరు చేసిన కోర్టును వెంటనే ప్రారంభించేలా సహకరించాలని కోరుతూ పటాన్ చెరు, రామచంద్రపురం మండలాలకు చెందిన న్యాయవాదులు శనివారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించిన వేలాది కేసుల పరిష్కారం కోసం సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తుందని, దీని మూలంగా కక్షిదారులతోపాటు న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. పలు సందర్భాల్లో రోడ్డు ప్రమాదాల సైతం గురికావాల్సింది వస్తుందని వాపోయారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ సువీశాల విస్తీర్ణంలో, ఆధునిక వసతులతో కోర్టు భవనం ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో ప్రభుత్వంతో చర్చించి త్వరితగతిన కోర్టు కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అడ్వకేట్లు ప్రభుదన్యం, రమేష్, శ్రీనివాస్, రవికుమార్, నాగరాజు, రమాదేవి, రవి, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.