పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థి దశనుండే క్రీడా స్ఫూర్తిగా పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ద్వితీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుపై చూపిన శ్రద్ధ క్రీడలపై కనపరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రీడారంగంలో భారతీయుల పాత్ర అతి తక్కువగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు తగు ప్రాధాన్యత అందించడంతోపాటు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోనూ మినీ స్టేడియాలతో పాటు క్రీడా పోటీలను ఏర్పాటు చేస్తూ క్రీడారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…