గీతం స్కాలర్ ఆయేషాబేగంకు పీహెచ్ డీ

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని ఫార్మసీ విభాగం పరిశోధక విద్యార్థిని కె. ఆయేషా బేగంను డాక్టరేట్ వరించింది. ‘ఎల్ సీ-ఎంఎస్ / ఎంఎస్ ద్వారా జీవమాత్రికలలో ఎంపిక చేసిన ఔషధాల జీవవిశ్లేషన పద్ధతి అభివృ ద్ధి, ధ్రువీకరణ, ఫార్మకోకెనైటిక్ అధ్యయనంలో దాని పనితనం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎల్సీ-ఎంఎస్/ఎంఎస్ గుర్తింపును ఉపయోగించి మానవ ప్లాస్మాలోని ఫెద్రాటినిబ్, పెక్సి డుర్ట్ నిబ్ , ఉపాదాసిటివిబ్ అనే ఎంపిక చేసిన ఔషధాల కోసం ప్రస్తుత పరిశోధన లక్షించినట్టు తెలిపారు. అభివృద్ధి చెందిన, ధృవీకరించిన పద్ధతుల నుంచి పొందిన ఫలితాలు అధిక స్థాయి సున్నితత్వం, నిర్దిష్టత, ఎంపిక, పునరుత్పత్తి, చాలా వేగవంతమైన తొలగింపు, కోలుకోవడం వంటివి గత పద్ధతులతో పోల్చినప్పుడు తక్కువ ప్రభావంతో స్థిరత్వాన్ని చూసాయన్నారు. ఈ నూతన విస్తృత అధ్యయనం మానన ప్లాస్మాలో ఎంపిక చేసిన ఔషధాల కోసం వినూత్న పద్ధతిని రూపొందించినట్టు తెలియజేశారు. అయేషా బేగం సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం. విశ్వవిద్యాలయం, హై దరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరణ్ దాస్, విశాఖపట్నం ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. రాజా, పలు విభాగాలు: అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *