Telangana

గిరిజన విద్యార్థులకు సెన్స్పె అవగాహన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ ప్రాంతంలోని గిరిజన/గ్రామీణ పాఠశాల విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం (సెన్స్)పై అవగాహన ఏర్పరచి, కార్యాచరణ ఆధారిత అభ్యాసం ద్వారా శాస్త్రం పట్ల వారి వెఖరిని మార్చే లక్ష్యంతో వెళ్తానిక ప్రదర్శన, క్విజ్ పోటీలను హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్నది. క్రిస్టలోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో, విద్యార్థులకు చేరువయ్యే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, పడమట నరసాపురంలో ఈనెల 10వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.కార్యాచరణ ఆధారిత అభ్యాసం (యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్) ద్వారా సెన్స్ పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి, వారి నెఖరిలో పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయబోతున్నామన్నారు.. జూలూరుపాడు మండలం, ఆ చుట్టుపక్కల గిరిజన విద్యార్థులకు సమీకరించి, ప్రముఖ పరిశోధకులు, ఆచార్యులతో సెన్స్ ప్రాముఖ్యతను వివరించడం, సెన్స్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం, క్విజ్ పోటీలు, నమూనాల ప్రదర్శన వంటివి నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆయా పోటీల విజేతలకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వెర్డే శాసనసభ్యుడు లావుడ్యా రాములు నాయక్, హైదరాబాద్ లోని ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జీవన్లాల్ లావుడ్యాలు పాల్గొంటారని ప్రిన్సిపాల్ వివరించారు.ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను ఉచితంగానే నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ ఎగ్జిబిషన్లో రసాయన, భౌతిక, గణిత శాస్త్ర నమూనాలను మాత్రమే ప్రదర్శించడానికి అవకాశం కల్పించనున్నట్టు స్పష్టీకరించారు. మరిన్ని వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్తలు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల 70136 02236 / డాక్టర్ కటారి 91777 1200 / డాక్టర్ ఆర్.బాలాజీరావు 97048 64966 లను సంప్రదించాలని, లేదా sciencexport@ailam.esu కు ఈ-మెయిల్ చేయాలని ఆయన సూచించారు

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago