Telangana

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రమశక్తి నీతి-2025 సెమినార్ కి చుక్క రాములు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాములు మాట్లాడుతూ ఈ లేబర్ పాలసీతో కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతున్నదని, సమిష్టి బేరసారాల హక్కును హరించి, ఐఎల్ ఓ ను బైపాస్ చేసి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈ పాలసీ తెచ్చారని ఆరోపించారు. దేశంలో కార్మికశక్తిని ఐక్యం కానీయకుండా కార్పొరేట్ల రాజ్యంలా మార్చడానికి ఈ శ్రమశక్తి నీతి 2025 ఉపయోగపడుతుందని, మన రాజ్యాంగంలో కార్మికులకు కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమకు గౌరవం వంటి విలువలకు పూర్తి విరుద్ధమని, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మూల కారణమైన కార్మికవర్గ హక్కులపై యూనియన్ల తో చర్చించకుండా ఏకపక్షంగా అమలుచేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ పాలసీని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దుచేయాలని, ఈ అంశంపై కార్మికవర్గమంతా ఐక్యమై పోరాటాలకు సిద్ధంకావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి. పాండురంగా రెడ్డి, ఎమ్. మనోహర్, ఎ. వీరారావు, ఎమ్. సత్తిబాబు, వివిధ కమిటీల సభ్యులు, మాజీ ఆఫీస్ బేరర్స్, మాజీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

20 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

21 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago