శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని భారతీయ విద్యాభవన్స్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి 67 వ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ ఉమాశాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు, ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ఈ నెల 4 వ తేదీ నాడు బి.హెచ్ ఇ. ఎల్ లో జరిగిన జిల్లా స్థాయి స్కేటింగ్ పోటరీలో తమ విద్యార్థులు నవనీత, యశ్విర్ లు బంగారు పతకాలు సాధించి నేటి అనగా మంగళవారం 23 నుండి 25 వరకు హైదరాబాద్ లోని దోమలగూడ లో జరగబోయే రాద్రస్థాయి పోరీలకు ఎంపికయ్యారని తెలిపారు. దీంతో పాటుగా తమ విద్యార్థులు రీతిరెడ్డి, అమ్బత లు ఇదివరకే జాతీయ స్థాయి లీటిల్లో పాల్గొని ప్రతిభ కనబరచారని వారికి అభినందనలు తెలిపారు. గెలుపొందిన విధ్యార్థులదరికీ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీవాణి, హెడ్ మిసెస్ ఖాను నిర్మల, క్రీడా ఉపాధ్యాయులను అభినందిస్తూ హర్షo వ్యక్తం చేసారు.
