మనవార్తలు ,పటాన్ చెరు:
అల్యూమినియం ఆధారిత మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమాల యాంత్రిక , అలసట ప్రవర్తన ‘ అనే అంశంపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని పి.సరితను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . విమాన నిర్మాణాలలో విస్తృతంగా వినియోగించే 7075 వంటి అల్యూమినియం మిశ్రమాలకు తుప్పు పట్టే అవకాశం ఎక్కువని , ఇది విమాన నిర్మాణ సమగ్రతను ప్రభావితం చేస్తుందని తెలిపారు . ఎందుకంటే , తుప్పు గుంటల నుంచి న్యూక్లియేట్ అయి , ప్రతికూల వాతావరణంలో వేగవంతంగా పెరుగుతాయన్నారు .
దీనివల్ల అనేక ఇంజనీరింగ్ యంత్రాలు , మెకానికల్ భాగాలు హెచ్చుతగ్గుల ఒత్తిడికి లోనవుతాయని , సాపేక్షంగా అధిక పౌనఃపున్యాల వద్ద జరుగుతాయని ఆమె తెలిపారు . ఈ సిద్ధాంత వ్యాసంలో , ఏఎల్ 7075 తో మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమాలను బేస్ మెటల్గా , జిర్మోనియం ఉపబలాలను తగు నిష్పత్తిలో వైవిధ్యంగా రూపొందించేందుకు ప్రయత్నించామన్నారు . వాటికి సిలికాన్ కార్బెడ్ , మాలిబ్డినం డెస్టల్నెడ్ స్టెర్డ్ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగించి , స్థిరత్వాన్ని కల్పించినట్టు తెలియజేశారు .
సరిత సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…