మనవార్తలు ,పటాన్ చెరు:
అల్యూమినియం ఆధారిత మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమాల యాంత్రిక , అలసట ప్రవర్తన ‘ అనే అంశంపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని పి.సరితను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . విమాన నిర్మాణాలలో విస్తృతంగా వినియోగించే 7075 వంటి అల్యూమినియం మిశ్రమాలకు తుప్పు పట్టే అవకాశం ఎక్కువని , ఇది విమాన నిర్మాణ సమగ్రతను ప్రభావితం చేస్తుందని తెలిపారు . ఎందుకంటే , తుప్పు గుంటల నుంచి న్యూక్లియేట్ అయి , ప్రతికూల వాతావరణంలో వేగవంతంగా పెరుగుతాయన్నారు .
దీనివల్ల అనేక ఇంజనీరింగ్ యంత్రాలు , మెకానికల్ భాగాలు హెచ్చుతగ్గుల ఒత్తిడికి లోనవుతాయని , సాపేక్షంగా అధిక పౌనఃపున్యాల వద్ద జరుగుతాయని ఆమె తెలిపారు . ఈ సిద్ధాంత వ్యాసంలో , ఏఎల్ 7075 తో మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమాలను బేస్ మెటల్గా , జిర్మోనియం ఉపబలాలను తగు నిష్పత్తిలో వైవిధ్యంగా రూపొందించేందుకు ప్రయత్నించామన్నారు . వాటికి సిలికాన్ కార్బెడ్ , మాలిబ్డినం డెస్టల్నెడ్ స్టెర్డ్ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగించి , స్థిరత్వాన్ని కల్పించినట్టు తెలియజేశారు .
సరిత సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…