శాంతా సిన్హా , అంపశయ్య నవీన్ కు – గీతం గౌరవ డాక్టరేట్లు

politics Telangana

– ఈనెల 30 న నిర్వహించే గీతం 13 వ స్నాతకోత్సవంలో ప్రదానం

– ముఖ్య అతిథిగా సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ 13 వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30 న నిర్వహించనున్నట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన ప్రొఫెసర్ శాంతా సిన్హాతో పాటు ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్లకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ ( డీ.లిట్ ) ని ప్రదానం చేయనున్నట్టు ఆయన తెలియజేశారు .

హైదరాబాద్ లోని సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్ కె నందికూరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని , స్నాతకోపన్యాసం చేయనున్నట్టు వెల్లడించారు . గీతం విశ్వవిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వీరేందర్ సింగ్ చౌహాన్ అధ్యక్షత జరిగే ఈ స్నాతకోత్సవంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ కూడా పాల్గొంటారని తెలిపారు .

ఈ పదమూడో స్నాతకోత్సవంలో 1,346 మంది విద్యార్థులు పట్టాలను తీసుకోవడానికి అర్హత సాధించారని , అందులో , బీఏ , ఎంఏ , బీబీఏ , బీకాం , ఎంబీఏ , బీఎస్సీ , ఎమ్మెస్సీ , బీటెక్ , ఎంటెక్ , బీఫార్మశీ విద్యార్థులున్నట్టు ప్రోవీసీ పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *