_ఐనోలులో ఘనంగా మల్లన్న స్వామి జాతర
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం ఐనోలులో గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు సొంత నిధులతో దేవాలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు దైవభక్తిని అలవర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

