కోర్టును ప్రారంభించాలని ఎమ్మార్వో కు వినతి

Districts Hyderabad Telangana

మనవార్తలు, శేరిలింగంపల్లి :

అల్లాదుర్గము కు మంజూరైన కోర్టు ను వెంటనే ప్రారంభించాలని తహశీల్దార్ వేంకటేశ్వర్లు ద్వారా జిల్లా కలెక్టర్ కు అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో. వినతి పత్రాన్ని సమర్పించారు. సాధన కమిటీ అధ్యక్షులు కే బ్రహ్మం మాట్లాడుతూ అల్లాదుర్గం రేగోడు, టేక్మాల్, పెద్ద శంకరంపేట పాపన్నపేట తదితర మండలాల కోసం నూతనంగా జూనియర్ కోర్టును మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ రెండు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ప్రారంభించకపోవడం చాలా ఇబ్బంది కరం, ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా అల్లాదుర్గం మండల కేంద్రంలో కోర్టు ను వెంటనే ప్రారంభించాలని, పెండింగ్ కేసులు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ,రితీష్ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *