మన వార్తలు ,పటాన్ చెరు:
పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ లో ఎం డి ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్యం, పృథ్వి రాజ్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
ఎం డి ఆర్ యువసేన నిర్వహించిన అయ్యప్ప మహా పడి పూజ మండపంలో నీలం మధు ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ను మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అయ్యప్ప భక్తి గీతాలతో మంత్రోచ్ఛారణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని ఆయన తెలిపారు ఆధ్యాత్మిక చింతనలో మనసు ప్రశాంతం కలగటమే కాకుండా భక్తి భావం ఏర్పడి ప్రతి ఒక్కరు మంచి మార్గాన వెళ్ళేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.