గణితంలో ఆర్.సుహాసినికి పీహెచ్.డీ.

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 

గణితంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్.డీ)ని విజయవంతంగా పూర్తిచేసిన డాక్టర్ ఆర్. సుహాసినిని హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అభినందించింది. ‘నానోపార్టికల్స్ తో కూడిన సాగే షీటుపై మాగ్నెటోహైడ్రోడైనమిక్ (ఎంహెచ్ డీ) మైక్రోపోలార్ ద్రవ ప్రవాహంపై ఒక సంఖ్యా అధ్యయనం’ అనే శీర్షికతో ఆమె పరిశోధన చేసినట్టు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఇది న్యూటోనియన్ కాని ద్రవ గతిశాస్త్రం, వేడి, ద్రవ్యరాశి బదిలీ దృగ్విషయాల అధ్యయనానికి గణనీయమైన తోడ్పాటును అందిస్తుందన్నారు.ఈ పరిశోధన గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, పరిశోధన పర్యవేక్షకుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస రాజు మార్గదర్శనంలో నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ అధ్యయనం మాగ్నెటో-మైక్రోపోలార్ నానోఫ్లూయిడ్ ప్రవాహంపై వివిధ భౌతిక పారామితుల ప్రభావాలను విశ్లేషించడానికి అధునాతన సంఖ్యా పద్ధతులను ఉపయోగించిందని, ధృవీకరించిన ఫలితాలు ఇప్పటికే అందుబాటులో ఉన్న సాహిత్యంతో దగ్గరగా ఉన్నాయన్నారు.డాక్టర్ సుహాసిని విజయవంతంగా డాక్టరేట్ డిగ్రీకి అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, ఇతర అధ్యాపకులు తదితరులు ఆమెను హృదయపూర్వకంగా అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *