Telangana

బొల్లారంలో అంగరంగ వైభవంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

వేల సంఖ్యలో తరలివచ్చిన ఒరిస్సా వాసులు, జగన్నాథుడి భక్తులు

బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :

పూరి జగన్నాథుడి విశ్వ ప్రసిద్ధ రథయాత్ర పురస్కరించుకుని బొల్లారం మున్సిపల్ పరిధిలో గల జగన్నాథుని ఆలయంలో నిర్వహించిన రథయాత్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. రథయాత్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వేలాది భక్తుల జయ జయధ్వనుల మధ్య రథయాత్ర ప్రారంభమైంది.
ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. మినీ ఇండియా గా పేరుందిన బొల్లారం మున్సిపాలిటీలోని అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నామని తెలిపారు.పూరి జగన్నాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల పండుగలను సమ ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago