Hyderabad

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి

అమీన్ పూర్:

ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పని చేస్తోందని శాసనమండలి ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు.

అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం మెగా హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి తో పాటు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బి హెచ్ ఈ ఎల్ మెట్రో ఎంక్లేవ్ పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు.

 

అనంతరం గ్రామ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి  మాట్లాడుతూ పల్లెలు,పట్టణాలు పరిశుభ్రంగా చేసుకొని,అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.

పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేసుకోగలిగామని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధికారులు చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నితీశా శ్రీకాంత్, మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

1 hour ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago