ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత…
పటాన్ చెరు:
పటాన్ చెరు ఏరియా ఆసుపత్రి లోని కోవిడ్ రోగులకు ఉపయోగపడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను డాక్టర్ మల్లెల శ్రీనివాస్ మిత్రబృందం రామచంద్రాపురం మాజీ ఎంపిపి నాలకంటి యాదగిరి యాదవ్ తో కలిసి శనివారం ఆసుపత్రి సూపరిండెంట్ వసుంధర కు అందజేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోన సోకిన రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ వాయువు తయారు చేసి అందించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను (పది లక్షల విలువ) గాంధీ మెడికల్ కాలేజీ 2000 బ్యాచ్ కు చెందిన మిత్ర బృందం తరపున డాక్టర్ మల్లెల శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ ఎంపిపి నాలకంటి యాదగిరియాదవ్, కంకర శ్రీను, వంగరి అశోక్, ఆసుపత్రి వైద్య బృందం పాల్గొన్నారు.