Districts

పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన దీక్షలు

_పటాన్చెరు, రామచంద్రపురం నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

_చివరి గింజ కొనే వరకు జంగ్ కొనసాగిస్తాం

మనవార్తలు,పటాన్‌చెరు:

రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు నిర్వహించారు. రామచంద్రాపురం, పటాన్చెరు లో నిర్వహించిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం పండించిన చివరి ధాన్యం గింజని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు గ్రామస్థాయి నుండి ఢిల్లీ వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రైతాంగానికి మద్దతుగా పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు.

గతంలో పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తే రాష్ట్ర బిజెపి నాయకులు వరి పంటను సాగు చేయాలని రైతులను రెచ్చగొట్టారని అన్నారు. నేడు పంట కొనుగోలు విషయంలో బిజెపి నాయకులు చేతులెత్తేయడం వాడి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. ఆరుగాలం కష్టించి పండించిన రైతన్న నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మూలంగా అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వన్ నేషన్- వన్ ప్రోక్యూర్మెంట్ విధానాన్ని వెంటనే దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే వారం రోజుల్లో జాతీయ రహదారి దిగ్బంధం, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago