బడ్జెట్ కంటే ప్రతిపాదన నాణ్యత ముఖ్యం : డాక్టర్ రాజు

Districts politics Telangana

మన వార్తలు ,పటాన్ చెరు:

ఓ అధ్యాపకుడు , ఒక పరిశోధనా ప్రాజెక్టుకు ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు పొందాలంటే , బడ్జెట్ కంటే ప్రతిపాదన నాణ్యత చాలా ముఖ్యమని భారత శాస్త్ర సాంకేతిక విభాగం ( డీఎస్టీ ) పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద రాజు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ పరిశోధనా ప్రాజెక్టులకు బయటి నుంచి నిధుల సమీకరణ అవకాశాలు , ప్రభావశీలంగా ప్రతిపాదనను రూపొందించడం ‘ అనే అంశంపై మంగళవారం ఆయన అధ్యాపకులతో ముఖాముఖి చర్చించారు . ఒక ప్రతిపాదనకు సంక్షిప్త నేపథ్యం లేదా పరిచయం ఉండాలని , అమలు ప్రణాళిక , ఆశించిన ఫలితం , విశిష్టమైన కీలక ఐదారు పదాలను ఉటంకించాలని డాక్టర్ రాజు స్పష్టీకరించారు . ప్రాజెక్టు ప్రతిపాదన నిర్దిష్టంగా ఉండాలని , సాధారణ అంశాలను నివారించాలన్నారు .

మనదేశంలో పరిశోధనా నిధుల అవకాశాల గురించి , సమర్థవంతమైన పరిశోధన ప్రతిపాదనను ఎలా రూపొందించాలి , ప్రతిపాదనల సమర్పణ చిట్కాలు వంటి వాటి గురించి ఆయన వివరించారు . ఒక సమస్యకు తార్కిక పురోగతిలో కేంద్రీకృత పరిష్కారాన్ని అందించడం విజయవంతమైన మంజూరు ప్రతిపాదనగా అభివర్ణించారు . పరిశోధనా నిధులను సాధించాలంటే , వినూత్న ప్రతిపాదనలోని ప్రత్యేకమైన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించాలని , ఊహించిన విజయాలు , కొత్త పరికల్పనను తీసుకురావడం , లక్ష్యాల సాధన కోసం సమయపాలనను పేర్కొనడం వంటి కీలకమైన సాంకేతిక మెల్దురాళ్ల జాబితాను డాక్టర్ రాజు ఏకరువుపెట్టారు .

సెర్చ్ , డీఎస్టీ , డీబీటీ , డీఏఆర్ఆస్ఈ , ఐసీఏఆర్ , డీఏఈ , డీఆర్డీవోలతో సహా సీపీఆర్ఎస్ఐ , ఇస్రో , ఏఐసీటీఈ , సీఐఎస్ఆర్ , యూజీసీ వంటి పరిశోధనలకు నిధులను మంజూరు చేస్తున్న పలు ప్రభుత్వ సంస్థల జాబితాను ఆయన వివరించారు . తొలుత , గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.శివప్రాద్ , ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నీకే మిట్టల్ అతిథిని స్వాగతించగా , డాక్టర్ పి . ఈశ్వరయ్య ఆయనను అధ్యాపకులకు పరిచయం చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *